యాదాద్రి భువనగిరి, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు ప్రభుత్వం అండగా నిలబడి ప్రోత్సాహకాలు అందిస్తున్నది. వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాలకు అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. తర్వాత జంటలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 86 జంటలు కులాంతర వివాహాలు చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో పలువురికి చెకులు అందించారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2.50లక్షలను మూడేండ్ల తర్వాత కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.3లక్షల నగదుతోపాటు వడ్డీ కూడా అందుతుంది. కులాంతర వివాహం చేసుకున్న వెంటనే డబ్బులు ఇస్తే ఏమైనా గొడవలు జరిగి విడిపోయేందుకు అవకాశం ఉందని, మూడేండ్ల పాటు జంటలు అర్థం చేసుకొని కలిసి జీవించేందుకు ఆసారం ఉంటుందనే ఉద్దేశంతో ఆలస్యంగా ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం, స్వయం ఉపాధి ఎంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటారని చెబుతారన్నారు.
నాడు రూ.50వేలు.. నేడు 2.50లక్షలు..
కులాంతర వివాహం చేసుకున్న జంటలను ఆయా కుటుంబాలు మొదట్లో ఆదరించకపోయినా తర్వాత దగ్గరకు తీసుకుంటున్నాయి. మరికొంత మంది దూరంగా పెడుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు నగదు ప్రోత్సాహం అందిస్తున్నది. అయితే ఆ ప్రోత్సాహం కల్యాణలక్ష్మి పథకం కన్నా తకువగా ఉండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2011 వరకు కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం 2012 నుంచి 2019 వరకు రూ.50వేల చొప్పున అందజేసింది. ప్రస్తుతం రూ.2.50లక్షలకు పెంచింది.
86 జంటల నుంచి దరఖాస్తులు..
జిల్లాలో కులాంతర వివాహాలకు సంబంధించి ఇప్పటి వరకు 86 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇప్పటికే 20మందికి ఇటీవల చెకులను అందించాం. మిగతావారివి పురోగతిలో ఉన్నాయి. గతంలో 50 వేల ప్రోత్సాహకం మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జయపాల్రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి
అర్హులు ఎవరంటే..
దరఖాస్తు ఇలా..
వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యా సంస్థల నుంచి టీసీ, పదో తరగతి మారుల మెమో, వివాహం చేయించిన అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిపి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, వివాహానికి సాక్షుల వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలి.