ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్కు గీత కార్మికుల కృతజ్ఞతలు
భువనగిరి కలెక్టరేట్, జూలై 11 : భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల నాయకులు, గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ను హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గ పరిధిలో గీత కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నందనంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం సంతోషకరమన్నారు.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే నీరా కేంద్రం ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్, నాయకుడు వంగాల వెంకన్నగౌడ్, సర్పంల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ నోముల పమేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు నరాల వెంకటస్వామి, కడమంచి ప్రభాకర్, సామల వెంకటేశ్, రాసాల మల్లేశం, నాగెల్లి సత్యనారాయణగౌడ్, ఓరుగంటి రమేశ్గౌడ్, బబ్బూరి రమేశ్గౌడ్, మట్ట ధనుంజనేయులుగౌడ్, నల్లమాసు సత్యనారాయణగౌడ్, గోద చిన్న శ్రీనివాస్, ర్యాకల శ్రీనివాస్, వెంకటేశ్, రంగయ్య, మల్లేశ్, భరత్ ఉన్నారు.