నల్లగొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోరాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు నూతనంగా మంజూరైన వృధ్యాప్య పింఛకార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్టంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.