నందికొండ, జనవరి 6 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు. నందికొండ పైలాన్కాలనీలోని కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల క్రీడలు శుక్రవారం ముగిశాయి. రాత్రి నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నతస్థాయి ఎదుగవచ్చన్నారు. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విజేతలకుఏ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్, అధ్యాపకులు ఆంజనేయులు, ప్రతాప్, శంకర్, వెంకట్, సోమన్న, వేణు, చక్రవర్తి, బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
క్రీడల్లో విజేతలు
ఖోఖో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో సూర్యాపేట జట్టు, ద్వితీయ స్థానంలో నల్లగొండ జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నల్లగొండ, ద్వితీయ స్థానంలో నాగార్జునసాగర్ జట్లు నిలిచాయి.
కబడ్డీ పోటీల్లో ..
బాలికల కబడ్డీలో ప్రథమ బహుమతి కోదాడ, ద్వితీయ బహుమతి తిరుమలగిరి, బాలుర విభాగంలో ప్రథమ నాగార్జునసాగర్, ద్వితీయ బహుమతి నల్లగొండ జట్టు గెలుచుకున్నాయి. బాలికల వాలీబాల్లో సూర్యపేట జట్టుకు మొదటి, నల్లగొండ జట్టుకు ద్వితీయ బహుమతి లభించింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో కోదాడ, ద్వితీయస్థానంలో నాగార్జునసాగర్, బాలిక చెస్లో ప్రథమస్థానంలో కోదాడ, ద్వితీయస్థానంలో సూర్యపేట, బాలుర విభాగంలో ప్రథమస్థానంలో కోదాడ, ద్వితీయ స్థానంలో నల్లగొండ జట్టు నిలిచాయి. బాలికల, బాలుర టెబుల్ టెన్నిస్లో ప్రథమ స్థానంలో కోదాడ, ద్వితీయస్థానంలో నాగార్జునసాగర్ జట్టు, డబుల్స్ విభాగంలో కోదాడ ప్రథమ, సూర్యపేట రెండో స్థానంలో నిలిచాయి. బ్యాట్మెంటన్ బాలికల, బాలుర సింగిల్ విభాగంలో ప్రథమస్థానంలో నల్లగొండ, నాగార్జునసాగర్, ద్వితీయస్థానంలో నాగార్జునసాగర్, తిరుమలగిరి, డబుల్స్లో ప్రథమస్థానంలో నల్లగొండ, కోదాడ, ద్వితీయస్థానంలో కోదాడ, తిరుమలగిరి జట్లు నిలిచాయి.