సూర్యాపేట, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు ముస్తాబయ్యాయి. వేడుకల సందర్భంగా జాతీయ జెండాల ఆవిష్కరణల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు.
అనంతరం అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించనున్నారు. అనంతరం తేనీటి విందు నిర్వహించనున్నారు.