ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
హాలియా, ఫిబ్రవరి 25 : ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మెరుగ్గా ఉందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శుక్రవారం హాలియాలోని పెన్షనర్స్ భవన్లో వైద్యఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాలకు చెందిన 242 మంది ఆశ కార్యకర్తలకు ఎమ్మెల్యే ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ కార్యకర్తల సేవలు అమోఘమన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలను లెక్కచేయకుండా రోగులకు వైద్య సేవలు అందించారని ప్రశంసించారు. వారి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆశ కార్యకర్తల వేతనాన్ని మూడు రెట్లు పెంచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కేశ రవి, మండల వైద్యాధికారులు డాక్టర్ శ్రీనివాస్, శంకర్, శంకర్నాయక్, జానకిరాములు, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, సీహెచ్ఓలు వెంకయ్య, శ్రీనివాస్ స్వామి, మోతీలాల్ సైదులు, జావెద్ పాల్గొన్నారు.
జాతర పోస్టర్ ఆవిష్కరణ
మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే అనుముల మండలం పేరూరులోని సోమేశ్వర స్వామి జాతరకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే నోముల భగత్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ రాయనబోయిన రామలింగయ్య, గ్రామ సర్పంచ్ యడవల్లి సుధారాణి నాగరాజు, రేగులగడ్డ దేవస్థాన చైర్మన్ జాల పాపయ్య పాల్గొన్నారు. హాలియాలోని అభి హెల్ప్లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన అక్షర భారత్ అక్షరవెలుగు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు నిర్వహించిన ఉచిత విద్య బోధనా సదస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల కోఆర్డినేటర్ సేవా నాయక్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.