అర్వపల్లి, ఆగస్టు 24 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోడూరు గ్రామంలో శ్రీశంభులింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకొస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కోట్ల రూపాయలతో అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా గ్రామస్తులంతా కలసికట్టుగా ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సుయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, నూతనకల్ జడ్పీటీసీ దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, తాసీల్దార్ యాదగిరిరెడ్డి, ఎంపీడీఓ విజయ, ఎంపీటీసీ సుమలత, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సామ అభిషేక్రెడ్డి, గౌరవ సలహాదారు మారోజు బ్రహ్మాచారి, సభ్యులు దేశగాని పాపయ్య, వీరెల్లి వెంకట్రెడ్డి, కాసం హరిబాబు పాల్గొన్నారు.