ఆత్మకూర్ ఎస్, డిసెంబర్ 20 : రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. పెంపకందారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులతో జీవాల్లో తుమ్ములు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. క్రిములతో సోకే అంటువ్యాధులతో పాటు ఆరు మయట మేత మేయడంతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
జీవాలు చలి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపకందారులు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. పీపీఆర్ (పుర్రు) వైరస్ సోకే అవకాశం ఉంటుంది. దీని నావారణకు నిర్ధిష్టమైన చికిత్స లేదు. రోగాలు రాకుండా దీర్ఘకాలం పనిచేసే అక్రిటెట్రాసైక్లిన్ వాడొచ్చు. నీరసించిన జీవాలకు గ్లూకోజ్ ఎక్కించవచ్చు. పెంపకందారులు పాకలను నిత్యం శుభ్రం చేయాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి.
– వేణుగోపాల్రావు, మండల పశువైద్యాధికారి