భూదాన్ పోచంపల్లి మార్చి 19 : అర్హులైన చేనేత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.ఇందుకోసం నేతన్నల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. ఇప్పటికే చేనేత మగ్గాలకు జియోట్యాగ్ చేసి ఆయా కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తున్నది. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి మరింత మందికి లబ్ధి చేకూరేలా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకురాగా నేతన్నల వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా మిగతా ప్రాంతాల్లోనూ త్వరలో కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలో 80కి పైగా గ్రామాల్లో 30 వేల చేనేత మగ్గాలకుగానూ 9,284 మగ్గాలు జియో ట్యాగింగ్ చేసి ఉన్నాయి.
భూదాన్ పోచంపల్లి మార్చి 19 : చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలు నేరుగా వారికి చేరేలా.. పథకాల అమలులో పారదర్శకత ఉండేలా సర్కారు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా చేనేత కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మగ్గాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా త్వరలో మి
మొదటగా పోచంపల్లిలో..
చేనేత మగ్గాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమాన్ని మొదటగా భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించారు. చేనేత జౌళి శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు నమోదు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 6,800 జియో ట్యాగింగ్ చేనేత మగ్గాలు ఉన్నాయి. అందులోనూ పోచంపల్లి మండలంలోనే అత్యధికంగా 2,200, చౌటుప్పల్లో 1400 మగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి వందలాది మంది చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నానరు. కొన్నేండ్ల క్రితం ఏజెన్సీ వారు ఇంటింటికీ వెళ్లి మగ్గాలకు జియో ట్యాగింగ్ నంబర్ ఇచ్చి ఆన్లైన్లో పొందుపర్చారు. అయితే వివరాలు సరిగా లేకపోవడంతో కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వాటిని సరిచేసేందుకే తిరిగి సర్వే చేపడుతున్నారు.
జాప్యం నివారించేందుకే..
రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా నూలు కొనుగోలుపై 40 శాతం రాయితీ ఇస్తున్నది. ప్రతి 40 రోజులకు ఒకసారి మాస్టర్ వీవర్ బిల్లులు అప్లోడ్ చేస్తే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే వివరాలు సరిగా లేక పోవడంతో కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతున్నది. దానిని నివారించేందుకు ప్రస్తుతం అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా మాస్టర్ వీవర్ బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే నేరుగా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే కానున్నాయి. దాంతో పాటు త్రిఫ్ట్ పథకంలో భాగంగా కార్మికులు తమ సంపాదనలో 8శాతం ప్రతినెలా జమ చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తున్నది. ఈ ప్రక్రియలో బ్యాంకులు అనుమతి లెటర్ ఇవ్వడంలో జాప్యం కారణంగా ఆలస్యమవుతున్నది. ఇకపై చేనేత అధికారులు బ్యాంక్కు వెళ్లి ఎన్నిఖాతాల్లో డబ్బులు జమ అయ్యింది గుర్తించి అప్పటికప్పుడు ప్రభుత్వ వాటాను జమ చేస్తారు. దాంతో పాటు చేనేత బీమా అందించడంలోనూ జాప్యం జరుగకుండా చర్యలు చేపడుతున్నారు.
నమోదు ఇలా
మగ్గం లొకేషన్, పనిచేసే ప్రధాన కార్మికుడు, ఇద్దరు సహాయ కార్మికులు, వారి ఆధార్ సంఖ్య, బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించడంతోపాటు ఒకో మగ్గానికి సంబంధించిన ఫొటోలు సేకరించి టీఎస్ హ్యాండ్లూమ్ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి చేనేత మగ్గం వివరాలు సేకరించనున్నారు.
పూర్తి వివరాలు ఆన్లైన్లో
చేనేత కార్మికులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించాం. మొబైల్ యాప్ ద్వారా చేనేత మిత్ర పథకం నమోదు కార్యక్రమం చేపట్టాం. కార్మికుల ఫొటోలు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను నమోదు చేస్తున్నాం. జియో ట్యాగింగ్ ఉన్న చేనేత కార్మికుడి ప్రొఫైల్ని యాప్లో నమోదు చేస్తున్నాం. కార్మికుడితో పాటు అనుబంధ కార్మికుల వివరాలను సేకరిస్తున్నాం. చేనేత కార్మికుడే తన మొబైల్ యాప్ ద్వారా వార్పు, మగ్గం నేసే వారి వివరాలను అప్లోడ్ చేస్తే నూలు సబ్సిడీ డబ్బులు నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయి. దీనికి సంబంధించి కార్మికులకు శిక్షణ ఇస్తాం. జియో ట్యాగింగ్ కలిగిన కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తాం. అవినీతికి తావు లేకుండా కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధి పొందనున్నారు.
–విద్యాసాగర్, చేనేత జౌళి శాఖ ఏడీ, యాదాద్రి భువనగిరి జిల్లా
అర్హులైన కార్మికులకు బీమా
రాష్ట్ర ప్రభుత్వ చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 12 మందికి బీమా డబ్బులు అందాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేసేందుకు మొబైల్ యాప్ ద్వారా కార్మికుల వివరాలు నమోదు చేస్తున్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– అంకం పాండు, అధ్యక్షుడు, చేనేత సెల్ భువనగిరి