నల్లగొండ, ఆగస్ట్టు 25 : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధ్దలతో శాంతి యుతమైన వాతావరణంలో జరుపుకోవడంతో పాటు మండలపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. గణేశ్ మండపాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖకు రూ.వెయ్యి డీడీ కట్టి విద్యుత్ సరఫరా తీసుకోవడంతో పాటు నాణ్యమైన వైరింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలీస్ శాఖ ఏఏ ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ నంబరింగ్ చేయాలని ఈ విషయంలో రెవెన్యూ యంత్రా ంగం సలహాలు తీసుకోవాలన్నారు. విగ్రహాల వద్ద రోజూ శానిటేషన్ నిర్వహించాలని, కొవిడ్ సోకకుండా ఉండడానికి ఎక్కువ మంది గుమి కూడరాదని అన్నారు. అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ వారు చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా ఎప్పడికప్పుడు ఆయా ప్రాంతాలను పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్లు ఉపయోగి ంచు కోవడానికి అనుమతి ఉందన్నారు. ప్రతి మం డపం వద్ద రాత్రి వేళల్లో కమిటీ సభ్యులు ఉండే విధంగా జాగ్రత్త పడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్ రావు, ఆర్డీఓలు, డీఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.