నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 15: స్వాతంత్య్ర సమరయోధుడు, రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ భిక్షం చిత్రపటానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుంకరి మల్లేశ్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.
ధర్మభిక్షం సేవాలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు చీర పంకజ్ యాదవ్, లొడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, వీరస్వామి, కొండ వెంకన్న, గాదె వినోద్రెడ్డి, బొర్ర సుధాకర్, నాగరాజు గౌడ్, ఏడు కొండల్, పర్వతాలు, ఎల్.వీయాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ, రఘుపతి, అంబటి వెంకన్న, సింగం రామ్మోహన్, జనార్దన్, జెర్రిపోతుల లింగయ్య ,ఆంజయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలకేంద్రంలోని సీపీఐ ధర్మబిక్షం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఈదుల భిక్షంరెడ్డి, నాయకులు చల్లం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.