నీలగిరి, జనవరి 24 : ఇటీవల పోలీస్ దేహ దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన, గ్రూప్-4కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్కుమార్రెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 20వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా జిల్లా నుంచి అత్యధికంగా యువకులు ఉద్యోగాలు సాధించేందుకు తమవంతుగా సహకారం అందిస్తున్నామన్నారు. గత నెలలో జరిగిన పోలీస్ ఈవెంట్స్లో కూడా సుమారు 30వేల మందికి పైగా ప్రోటీన్ పుడ్స్ను అందించినట్లు తెలిపారు.
పోలీస్ పరీక్షల్లో అర్హత సాధించిన అందరికీ మెయిన్స్పై పూర్తి స్ధాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. తమకు గ్రూప్- 4 శిక్షణకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయని, వారికి జనవరి 29న ప్రవేశ పరీక్షపెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి చివరి నాటికి సుమారు 50 రోజులు మంచి ఫ్యాకల్టీతోపాటు అన్ని వసతులు కల్పించి శిక్షణ ఇవ్వనున్నామని, చివరి రోజు మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచామని, సోషల్ మీడియా ద్వారాగానీ, క్యాంపు కార్యాలయంలోగానీ అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఫోకస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, నాయకులు దుబ్బ ఆశోక్సుందర్, మునాస వెంకన్న, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.