నీలగిరి, డిసెంబర్ 6 : పేదల కోసం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. మంగళవారం సాయినైసా ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా నైసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, నైసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ రాపోల దత్తాగణేశ్, మున్సిపల్ డాక్టర్లు రాపోలు అనిల్ కుమార్, దివ్య, డాక్టర్ దైవాదీనం, రాపోలు అవంత్ కుమార్, చేనేత సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్, కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్,బోయినపల్లి శ్రీనివాస్. గుండగోని యాదయ్య పాల్గొన్నారు.