ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి
ఆలేరు, జూన్19 : ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న పేదల కోసమే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆదేశాలతో హిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేశ్, దవాఖాన ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆలేరు ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉస్మానియా దవాఖానలో క్షణం తీరికలేకుండా ఉండే వైద్యు లు ఇక్కడికి వచ్చి పేదలకు వైద్యం అందించడంపై ప్రభుత్వ విప్ వారిని అభినందించారు. వైద్య శిబిరంలో తుంటి ఎముకలు, మోకాలి చిప్పల అరుగుదల, తుంటి ఎముకల మార్పిడి శస్త్ర చికిత్సల కోసం పరీక్షలు నిర్వహించారు. 400 మంది రో గులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ క్రాంతికుమార్, శ్రీనివాస్, మార్కె ట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, వైస్ చైర్మన్ మాధవీవెంకటేశ్, కౌన్సిలర్లు భేతి రాములు, రాయపురం నర్సింహులు, సునీత, నాగలక్ష్మి, శ్రీకాంత్, పుట్టమల్లేశ్, పార్టీ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, బాలస్వామి, సంతోష్ పాల్గొన్నారు.