త్రిపురారం, జనవరి 27 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు పల్లెలను పట్టించుకోలేదని, తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయించి అన్ని వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేసి సీఎం కేసీఆర్ కలలను సాకారం చేయాలని సూచించారు.
కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
కంపసాగర్ పరిధిలోని మోడల్ స్కూల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్వారు రూ. 2.25 కోట్లతో నిర్మిస్తున్న గాంధీ బాలికల విద్యాలయ కొత్త భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యాభివృద్ధికి రెడ్డీస్ ల్యాబ్ వారు ముందుకు రావడంతో ల్యాబ్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కంపసాగర్ పరిధిలోని ఆదర్శ పాఠశాల గదులు, రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం రూ.10 లక్షల వ్యయంతో అల్ట్రా ట్రైనింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ప్రజలతో మాట్లాడి శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.11.72లక్షల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే నోముల భగత్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అందించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అనుముల పాండమ్మ, జడ్పీటీసీ భారతి, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, ఏఈ నరేందర్రెడ్డి, రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులు శరత్చంద్ర, కృష్ణారావు, తాసీల్దార్ కేసీ. ప్రమీల, పీహెచ్సీ డాక్టర్ రమావత్ శంకర్, సర్పంచులు అనుముల శ్రీనివాస్రెడ్డి, అవిరెండ్ల అడివయ్య, కలగాని శ్రవణ్, ఎంపీటీసీలు గట్టు యాదగిరి, ధనావత్ రవి, అంబటి రాము, నాయకులు కామెర్ల జానయ్య, ధూళిపాల రాంచంద్రయ్య, బైరం కృష్ణ పాల్గొన్నారు.