హుజూర్నగర్, ఫిబ్రవరి 10 : కృష్ణా జలాల పరిరక్షణకు ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చంటి క్రాంతికిరణ్ కోరారు. హుజూర్నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు.
బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణాజలాలు కేంద్ర పరిధిలోకి వెళ్లాయన్నారు. వాటి ని సాధించుకునేందు కు సాగర్ ఆయకట్టు రైతాంగం పోరుబాట పట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, ఏడు మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.