చందంపేట(దేవరకొండ), మార్చి 7: ప్రజల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల ప్లాట్లు క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్లాట్ల ఉచితంగా క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని చెప్పిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు మౌనం వహించడం వారి వైఖరికి అద్దం పడుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, ముక్కమల బాలయ్య, పరమేశ్, మోహన్కృష్ణ, వేముల రాజు, జక్కుల లోక్యనాయక్, బొడ్డుపల్లి కృష్ణ, యాదగిరి, తులసీరాం, జయప్రకాశ్ నారాయణ, ఇలియాస్, సత్యనారాయణ, బాలు, బాబా, శంకర్నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.