మిర్యాలగూడ, ఫిబ్రవరి 9 : కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీపై వాస్తవాలు వివరించేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మిర్యాలగూడ నియోజకర్గ సమన్వయకర్త, పటాన్చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం వేములపల్లి, మాడ్గులపల్లి, అడవిదేవులపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నదని, గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు.
కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంతో జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. భారీ బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 15వేల మందికిపైగా తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో నల్లగొండ పోస్టర్ను ఆవిష్కరించారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలాజీనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, పాలుట్ల బాబయ్య, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, ఎండీ కరీం, జెర్రిపోతుల రాములుగౌడ్, నిమ్మల నవీన్రెడ్డి, కట్టా మల్లేశ్గౌడ్, పేరాల కృపాకర్రావు, చిర్ర మల్లయ్యాయదవ్, మిర్యాల మధుసూదన్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.