మిర్యాలగూడ, మార్చి 24 : ప్రకృతి సిద్ధ రంగులతో హోలీని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి హోలీ జరుపుకోవాలన్నారు. హోలీ సందర్భంగా ఒకరిపై మరొకరు చల్లుకునేది రంగులు కాదని, అనురాగం, ఆప్యాయతలు కలిపిన పన్నీటి జల్లులు అని ఆయన ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
మాడ్గులపల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని బొమ్మకల్ పరిధిలో గల గణపతివారిగూడెంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, మాజీ సర్పంచ్ మారుతి వెంకట్రెడ్డి, నూకపంగల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.