మిర్యాలగూడ, ఫిబ్రవరి 2 : ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోసం దరఖాస్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు సైతం కొత్తగా ఓటు న మోదు చేసుకోవాలన్నారు.
2020 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పట్టా పొందిన వారు ప్రొవిజనల్ సర్టిఫికెట్, మెమో(గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన జిరాక్స్ కాపీ), ఓటరు ఐడీ కార్డు, పాస్ సైజ్ ఫొటోలు, మొబైల్ నంబర్, ఆధార్నంబర్ను దరఖాస్తు ఫారంలో నింపి తాసీల్దార్ కార్యాలయంలో ఈనెల 6లోపు అందజేయాలని సూచించారు. ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే బీఆర్ఎస్ కార్యాలయం ఫోన్ నంబర్ 7675 966631 సంప్రదించాలని పేర్కొన్నారు.