నకిరేకల్, ఏప్రిల్ 6 : నమ్మి ఓటేసిన రైతులను నట్టేట ముంచారని, రైతు కంట కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలకు మనుగడ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నకిరేకల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెసఃవ మ్యానిఫెస్టోలో రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని, రూ.15 వేలు రైతుబరోసా ఇస్తామని, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం హాస్యాస్పదమన్నారు. వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించకపోవడం దారుణమన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీక్షలో జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, తరాల బలరాం, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మహేందర్రెడ్డి, కట్టంగూర్ పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, నాయకులు సదానందం, దైద పరమేశ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.