మోతె, మార్చి 24 : నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే, మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేసిందన్నారు.
రైతులు ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టి వరి సాగు చేశారని, చేతికొచ్చిన పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో తీవ్రమైన నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతుంటే మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు, కార్యదర్శి మద్ది మధుసూదన్రెడ్డి, మిక్కిలినేని సతీశ్, జానీపాషా, నూకల శ్రీనివాస్రెడ్డి, గాంధీనాయక్, కోటేశ్, కాకి సురేందర్ రెడ్డి, భిక్షం, ఇండ్ల వెంకటేశ్వర్లు, ముత్తయ్య, సాజ్యనాయక్, పిట్ల నగేశ్, ప్రభాకర్రెడ్డి, కనకయ్య ఉన్నారు.