నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా అ పార్టీకి రాజీనామా చేశారు. తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నల్లగొండ మాజీ జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి, నల్లగొండ మండల వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్తోపాటు మాజీ ఎంపీటీసీలు, నాయకులు హైదరాబాద్లో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అలాగే మాజీ జడ్పీటీసీ, చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ బీజేపీకి రాజీనామా చేసి తన అనుచరులతో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నీలగిరి, నవంబర్ 8 : నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నల్లగొండ మాజీ జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి, నల్లగొండ వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేశ్, మాజీ ఎంపీటీలు నాగులవంచ లక్ష్మణ్రావు, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, దర్వేశిపురం ఆలయ మాజీ చైర్మన్ పాలకూరి గణేశ్తోపాటు పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
బుధవారం హైదరాబాద్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రులు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరినవారిలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు తండు నర్సింహగౌడ్, తిప్పర్తి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాల్వాయి సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవరంపల్లి చల్లారెడ్డి, యాపలగూడెం ఉప సర్పంచ్ నక్కా సైదులు, తిప్పర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు నకరబోయిన శ్రీను, బుద్ధారం గ్రామ శాఖ అధ్యక్షుడు ముప్ప మురళీధర్రెడ్డి, ఎంఆర్పీఎస్ తిప్పర్తి అధ్యక్షుడు బొజ్జ ఎల్లయ్య,
నాయకులు నెల్లికంటి గంగయ్య, దున్న లతీఫ్, కారింగుల సతీశ్గౌడ్, పల్లె శేఖర్, బొంత యాదయ్య, బొంత అంజయ్య, తుమ్మల సైదులు, దేవురంపల్లి మహేశ్రెడ్డి, చింతకుంట్ల చంద్రం, గుర్రం శ్రీనివాస్రెడ్డి, జక్కలి మల్లేశ్యాదవ్, కొండేటి అంజి, పాలడుగు లింగస్వామి, మందడి మధుసూదన్రెడ్డి, ఇల్లెందుల శివశంకర్, చెదురుపల్లి ప్రకాశ్, ఆలకుంట్ల రమేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్కుమార్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, డాక్టర్ చెరుకు సుహాస్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల మాజీ జడ్పీటీసీ, మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్తోపాటు పలువురు హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమంక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో పల్లపు బుద్ధుడు, చెరుకు లింగస్వామి, చేపూరి రాజు, మేడి రవీందర్, ఇమ్మడి విజయ్, పబ్బు లింగస్వామి, పోకల రాములు, పోకల దినేశ్, రామ్కుమార్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, ఉప్పల వెంకట్రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, గోధుమగడ్డ జలంధర్రెడ్డి, బొలుగూరి సైదులు పాల్గొన్నారు.