హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, పోలీసుల అక్రమ ప్రవర్తనను నిరసిస్తూ.. విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ సిటీ పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ సమర్పించిన విజ్ఞప్తి మేరకు కఠిన ఆంక్షలతో సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షిత కే మూర్తి అనుమతినిచ్చారు. ధర్నా చౌక్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దీక్ష చేపట్టాలని, ధర్నాలో వెయ్యి మందికి మించి పాల్గొనడానికి వీలు లేదని, నిబంధనలకు విరుద్ధంగా జనం గుమిగూడవద్దని తెలిపారు.