మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్లలో గల వేములూరి రిజర్వాయర్లో బుధవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా పెద్ద పెద్ద పాలేత చేపలు వలకు చిక్కాయి. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువుల్లో వదిలిన చేప పిల్లలు నేడు ఒక్కొక్కటి సుమారు 10 నుంచి 15 కేజీల సైజు వరకు పెరిగినట్లు పేర్కొన్నారు.
పాలేత చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని, కిలోకు సుమారు రూ.400 వరకు ధర పలుకుతుందని తెలిపారు. భారీ చేపలు వలకు చిక్కడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.
– మఠంపల్లి, జనవరి 24