భూదాన్ పోచంపల్లి, జూలై 3: షార్ట్సర్యూట్తో ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగిరి రోడ్డులో జబ్వాణి ఆగ్రోటెక్ ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు షార్ట్సర్యూట్తో ఫ్ల్లైవుడ్, మిషన్లకు మంటలు అంటుకున్నాయి.
వెంటనే కంపెనీ సిబ్బంది యజమానికి, పోలీసులకు, ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు, భువనగిరి, చౌటుప్పల్, హయత్నగర్ నుంచి ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు గంటల పాటు ప్రయత్నించాయి. కంపెనీలో ఫైర్సేఫ్టీ, నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పోచంపల్లి చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పారు. నష్టం వివరాలు తెలియ రాలేదు. జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్రావు, భువనగిరి ఫైర్స్టేషన్ ఆఫీసర్ మధూకర్, చౌటుప్పల్ ఫైర్స్టేషన్ అధికారి తోటపల్లి శివాజీ, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.