నల్గొండ: సడెన్గా ఒక ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అలాయ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ చెలరేగుతున్న మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.