రామగిరి, నవంబర్ 28 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఐసీటీ తైక్వాండో పోటీలను వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి యూనివర్సిటీ ఖ్యాతి చాటాలని సూచించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, పీడీలు, ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.
పురుషుల విభాగంలో.. హృషికేశ్, కొంపల్లి సంపత్కుమార్, అమన్, అతిక్ బేగ్, హేమంత్కుమార్, రవీందర్రెడ్డి, సిద్ధు, పర్వేజ్ ఉన్నారు.మహిళా విభాగంలో.. ప్రశాంతి, సుమంత, మౌనిక, జ్యోత్స్న, సౌమ్య, వర్ష ఉన్నారు.