– ఆత్మకూర్.ఎస్ ఏఓ దివ్య
ఆత్మకూర్.ఎస్, మే 04 : మట్టి నమూనా పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వేసుకోవాలని ఆత్మకూర్.ఎస్ ఏఓ దివ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం “రైతు వారోత్సవం కార్యక్రమం” ను సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం పాతర్లపహాడ్ రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దివ్య మాట్లాడారు. నేల ఆరోగ్య పరిరక్షణ రైతులందరూ చేయించుకోవాలన్నారు. అదే విధంగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానాలు పాటించి అధిక దిగుబడులు పొంది అధిక లాభాలు సాధించాలన్నారు.
అదేవిధంగా సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు, మట్టి నమూనా సేకరణ ఫలితాల వివరాలను రైతులకు వివరించారు. మట్టి నమూనా ఎలా చేయాలో తదితర అంశాలపై రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన అవగాహన కల్పించారు. అనంతరం మట్టి నమూనా పరీక్ష ఫలితాలు రైతులకు అందజేశారు. అదే అదేవిధంగా ఏపూర్, ఆత్మకూరు, నెమ్మికల్, తుమ్మల పెన్పహాడ్ రైతు వేదికల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఏఈఓలు, గ్రామ సర్పంచులు, రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాతర్లపహాడ్ గ్రామ సర్పంచ్ అరెంపుల ఉపేంద్ర, ఏఈఓ పవన్, శివమూర్తి, శివకుమార్, బాలాజీ పాల్గొన్నారు.