మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కోటిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాటి నవాబ్, రేపాల రమేష్, గుడిపాటి సైదులుబాబు, గొంగిడి సైదిరెడ్డి, ఉదయభాస్కర్, గోవిందరెడ్డి ఉన్నారు.