చందంపేట, మార్చి 22 : వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని చిత్రియాల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పెద్దమూల గ్రామాల్లోని అటవీ ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి బీట్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. వేసవిలో వన్య ప్రాణుల దాహర్తి తీర్చేందుకు సాసర్ పిట్స్లో నీటిని నింపడంతోపాటు బోర్లు వేయించాలని సూచించారు.
బీట్ ఆఫీసర్లు అటవీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి అడవి జంతువుల సంచారాన్ని గుర్తించి ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో మూడు బోర్లు వేయించామని, కొత్తగా 8 సాసర్ పిట్స్ ఏర్పాటు చేశామని అన్నారు. వన్య ప్రాణులను వేటాడినా, వాటికి హాని కలిగించినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు, పశువుల పెంపకందారులు అటవీ ప్రాం తంలోకి ప్రవేశించరాదన్నారు. ఆయన వెం ట ఎఫ్ఆర్ఓలు సాయిప్రకాశ్, భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ శ్రీదేవి, రాగ్యానాయక్, సైదులు ఉన్నారు.