నల్లగొండ రూరల్, డిసెంబర్ 5: పంట మంచి దిగుబడికి భూసార పరీక్షలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, డీఏఓ సుచరిత సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా పానగల్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నేలలో భూసారం రోజు రోజుకు తగ్గిపోతున్నందున రైతులు ఎరువుల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. జీవన ఎరువులతో డీఏపీ వాడకం కొంత తగ్గుతుందన్నారు. జిల్లాలో 145 క్లస్టర్లలో భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శాంతి, నిర్మల, మండల వ్యవసాయాధికారి సుమన్ రామన్, సర్పంచులు నారగోని నర్సింహ, ఎలుక శ్రీనివాస్రెడ్డి, నాయకులు గాదె రాంరెడ్డి, ఏఓలు అబ్దుల్, వాసుదేవరెడ్డి, పెద్ది వెంకటయ్య, కోట్ల జయపాల్రెడ్డి పాల్గొన్నారు.
రైతు ఉత్పత్తుల సహకార సంఘం ప్రారంభం
మండలంలోని చందనపల్లిలో రైతులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న అన్నదాత రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ సేవల పరస్పర సహాయక సహకార సంఘాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రారంభించారు. సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం, నాటు వేసే యంత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రైతుల సంఘంగా ఏర్పడి అవసరాలు తీర్చుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డీఏఓ సుచరిత, సర్పంచ్ మణేమ్మ, ఎంపీటీసీ పెద్ది ఇందిరమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, అన్నదాత సొసైటీ సభ్యులు సోమిడి ప్రమీల, గాదె రాంరెడ్డి, పెద్ది వెంకటయ్య, గాదె రాజశేఖర్రెడ్డి, ఉప్పల మురళి, గణేశ్, లక్ష్మయ్య, కరుణాకర్రెడ్డి, లింగయ్య, నారగోని నర్సింహ, నార్మాక్స్ డైరెక్టర్ కోట్ల జలంధర్రెడ్డి, జయపాల్రెడ్డి, నాయకులు వెంకన్న పాల్గొన్నారు.