గుర్రంపోడు, మే 20 : వానాకాలం సీజనుకు రైతులు సిద్ధంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలో పచ్చిరోట్ట వాడకం, వరి వెదజల్లడం, ఎరువులను విడతల వారిగా వాడడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో పీఎం కిసాన్ డబ్బులు పొందినవారు ఈ నెల 31 వరకు ఈ కేవైసీ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ కంచర్ల మాధవరెడ్డి, ఏఈఓ జితేందర్ గౌడ్, సర్పంచ్ షేక్ మస్రత్సయ్యద్మియా, ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, జాల యాదయ్య పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలోని దామరచర్ల, వీర్లపాలెం రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సమావేశంలో మిర్యాలగూడ ఏడీఏ నాగమణి, ఏఓ పార్వతీచౌహాన్, ఏఈఓలు పార్వతి, రమేశ్, ప్రియాంక, గ్రామ సర్పంచులు బంటు కిరణ్, అంజిరెడ్డి,కోటిరెడ్డి, బాలసత్యనారాయణ, పొన్నానాయక్ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని లెంకలపల్లి, యరగండ్లపల్లి, మర్రిగూడలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో దేవరకొండ ఏడీఎ ఎల్లయ్య, ఏఓ స్పందన, సర్పంచులు, ఏఈఓలు పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏఓ సూదగాని శ్రీనివాస్గౌడ్, ఏఈఓ నర్సింహ, సర్పంచ్ పందుల మారయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ శంకర్, వరంగంటి లింగస్వామి, శంకర్, శేఖర్రెడ్డి, మహేశ్, కృష్ణ, లింగయ్య పాల్గొన్నారు.
పెద్దవూర : మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు పచ్చిరొట్ట ఎరువులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్, సర్పంచ్ నడ్డి లింగయ్యయాదవ్, ఉప సర్పంచ్ మిట్టపల్లి ప్రదీప్రెడ్డి, ఎంపీటీసీ పులిమాల కృష్ణారావు, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బోయ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
డిండి : మండలంలోని చెర్కుపల్లి రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఈఓ వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు బంధు, రైతుబీమా, పీఎం కిసాన్ యోజన పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ జానకీరాములు, తిరుమలగిరి సర్పంచ్ శాగం శ్రవణ్కుమార్రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి హేమలత, రంగుండ్ల సర్పంచ్ సలహాదారుడు కోట్యానాయక్ పాల్గొన్నారు.
కట్టంగూర్, మే 20 : రైతులు రసాయన ఎరువులు తగ్గించి పచ్చిరొట్ట ఎరువులు వాడితే అధిక దిగుబడి పొందవచ్చని నల్లగొండ డీఏఓ టెక్నికల్ ఏడీఏ హుస్సేన్బాబు, నకిరేకల్ ఏడీఏ శ్రీధర్రెడ్ది అన్నారు. శుక్రవారం మండలంలోని అయిటిపాముల, కట్టంగూర్ రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వానాకాలం పంటసాగుపై రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు భూసారాన్ని పరిరక్షిండంతోపాటు సాగులో సహజసిద్ధ ఎరువులను వాడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు ఈనెల 31లోగా ఈ కేవైసీ తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్, విస్తరణ అధికారులు పరుశరాం, రమణ పాల్గొన్నారు.