వేములపల్లి, జనవరి 11 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లమోతు సిద్ధార్థ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులను రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నాయని, ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైతులే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. అంతకు ముందు రైతులతో కలిసి ఎండ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు చిర్ర మల్లయ్య యాదవ్, దొంతిరెడ్డి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు పిండి సతీశ్రెడ్డి, నాయకులు పుట్టల భాస్కర్, కట్టా మల్లేశ్గౌడ్, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, జెర్రిపోతుల రాములుగౌడ్, ఇరుగు వెంకటయ్య, శ్యాం సుందర్రెడ్డి, గౌరు శ్రీను, ఎండీ. షోయబ్, సైదులు, కట్టా వెంకటయ్య, దైద జాన్సన్, పుట్టల పౌల్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
నాంపల్లి : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని జాన్తండాలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎస్టీసెల్ మండలాధ్యక్షుడు సపావత్ సర్దార్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. దామెర గ్రామంలో టీఆర్ఎస్ మండల కార్యదర్శి బొట్టు జగన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్దులు, మండల శ్రీను, వెంకటయ్య, జలేందర్, మల్లయ్య పాల్గొన్నారు.
గుడివాడలో సంబురాలు
కేతేపల్లి : మండలంలోని గుడివాడ గ్రామంలో మంగళవారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి సర్పంచ్ కట్ట శ్రవణ్కుమార్ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆర్. సైదులుగౌడ్, రైతులు ఆర్.భద్రయ్య, హుస్సేన్, ఎస్కే. రషీద్, ఆర్.లింగయ్య, రైతులు పెద్దసం ఖ్యలో పాల్గొన్నారు.
నేడు మిర్యాలగూడలో రైతుబంధు సంబురాలు
మిర్యాలగూడ రూరల్ : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించే రైతుబంధు వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, మంగళవారం పరిశీలించారు. వేడుకల్లో ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి హాజరు కానున్నట్లు వారు తెలిపారు. వారి వెంట డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దింటి శ్రీనివాస్, నాయకులు సాధినేని శ్రీనివాస్, గోవింద్రెడ్డి, ఉదయ్ భాస్కర్, షోయబ్ ఉన్నారు.