గరిడేపల్లి, డిసెంబర్ 22 : వరి సాగు ఏ పద్ధతిలో చేపట్టినా అధిక దిగుబడి సాధన కోసం రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వరిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. దాని నివారణకు సరైన సమయంలో చర్యలు చేపట్టకపోతే అధిక దిగుబడులు సాధించడం కష్టమౌతుంది. వరి సాగులో కలుపును ప్రారంభంలో అరికడితేనే దాని నుంచి ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు పంటలో మొలిచిన కలుపును కూలీలతో తీయించేవారు. అయితే రానురాను కూలీల కొరత ఏర్పడడంతో పాటు కూలీ రేట్లు కూడా విపరీతంగా పెరుగడంతో రైతులు ఇతర పద్ధతులపై ఆధారపడాల్సి వచ్చింది. అదే సమయంలో కలుపును నివారించేందుకు అనేక రకాల హెర్బిసైడ్లు(కలుపు సంహారకాలు) మార్కెట్లోకి రావడం వల్ల రైతులకు సులువుగానే ఈ ఇబ్బంది తొలగిపోయినైట్లెంది. మార్కెట్లో లభ్యమయ్యే ఈ రసాయనిక మందులను ఇష్టం వచ్చినట్లుగా వాడకుండా మొలిచిన కలుపును బట్టి ఏ మందు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ పద్ధతిలో వాడాలనేది పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే వాటిని పంట చేలో వాడడం వల్ల కలుపును పూర్తిగా నలిపి వేయడంతో పాటు ఆశించిన దిగుబడులు పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ వివరించారు. సమాచారం కోసం రైతులు 9290615952 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. వరిలో కలుపు నివారణకు ఆయన తెలిపిన వివరాలు..
డ్రమ్ సీడర్, నేరుగా వెదజల్లే వరిలో..
వరి నాటిన 3-5 రోజుల లోపు
కలుపు 2-4 ఆకుల దశలో..
జాగ్రత్తలు..