– తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్
తుంగతుర్తి, జనవరి 23 : రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడి దిక్కులేని వారవుతారని కావునా జాగ్రత్తలు తప్పక పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుధాకర్, వాహనదారులు, మహిళలు పాల్గొన్నారు.