నాంపల్లి, మే 26 : రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నా రు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసానిచ్చారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి అక్రమంగా వసూ ళ్లు చేస్తున్న హమాలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు, లారీలను అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు.
29న పస్నూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
మండలంలోని పస్నూర్ గ్రామంలో ఈ నెల 29 న నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆత్మీయ సమ్మేళనం జరిగే సభ స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, అధికార ప్రతినిధి పోగుల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, మాల్ మార్కెట్ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, గజ్జెల శివరెడ్డి, ఇట్టం వెంకట్రెడ్డి, శ్రీలం జగన్మోహన్రెడ్డి, సపావత్ సర్ధార్ నాయక్, సైదులు, గౌరు కిరణ్, ఎదుళ్ల యాదగిరి, నాంపల్లి సంజీవ పాల్గొన్నారు.