హుజూర్నగర్కు ఈఎస్ఐ దవాఖాన
ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లతో త్వరలో ఏర్పాటు
మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో పట్టుబట్టి తెచ్చిన ఎమ్మెల్యే శానంపూడి
గతంలో ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చి విఫలం
25వేలకు పైనే కుటుంబాలకు అందనున్న వైద్య సేవలు
త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఉన్నా ఇన్నాళ్లు ఉపయోగం లేకుండా పోయింది. అనారోగ్యం బారిన పడితే దూర ప్రాంతాల్లోని ఈఎస్ఐ దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లలేని వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకొని ఆర్థిక ఇబ్బందుల పాలయ్యేవారు. కార్మికుల కష్టాలను గమనించిన స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఈఎస్ఐ దవాఖానను మంజూరు చేయించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించగా, వైద్య పరీక్షలకు ఆధునిక ల్యాబ్ను ఏర్పాటు చేశారు. త్వరలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దవాఖాన ప్రారంభం కానున్నది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఈఎస్ఐ దవాఖానను ఏర్పాటు చేస్తానని అనేక సార్లు కార్మికులకు హామీ ఇచ్చి విఫలమయ్యారు. ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటుతో నియోజకవర్గంలో 25 వేల మంది కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యాపేట, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : గత పాలకుల హ యాంలో హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుక బడింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ సీఎం అయిన తరువాత నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలుపొందిన నాటి నుంచి హుజూర్నగర్ నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్యే సైదిరెడ్డి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలిక శాఖల మంత్రి కేటీఆర్ అందిస్తున్న నిధులతో అభివృద్ధిలో దూ సుకెళ్తున్నది. మూడేండ్ల కాలంలోనే దాదాపు రూ.3,500 కోట్ల నిధులు మంజూరు కాగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, మినీ ట్యాంక్బండ్లు, పార్కులు, హరితహారంతో పచ్చదనం ఇలా ప్రతి ఒక్కటీ ప్రజలకు చేరువయ్యాయి. తాజాగా నియోజకవర్గానికి ఈఎస్ఐ ఆస్పత్రి కూడా మంజూరైంది. దానిని తాత్కాలికంగా ఆర్డీఓ కా ర్యాలయం సమీపంలోని భవనం అధికారులు సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో ఆస్పత్రి కోసం శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు.
ముగ్గురు వైద్యులతో ఆస్పత్రి
నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉండగా.. వాటిలో సుమారు 25 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈఎస్ఐ ఆస్పత్రిని మంజూరు చేయించారు. ఆస్పత్రిలో ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండి వచ్చే వారికి చికిత్స చేయడంతో పాటు అవసరమయ్యే మందులు ఇస్తారు. రక్త పరీక్షలు చేసేందుకు ల్యాబ్ కూడా అందుబాటులో ఉండనున్నది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వారి వద్ద ఈఎస్ఐ కార్డులున్నప్పటికీ స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి. లేదంటే సుదూర ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లేవారు. హుజూర్నగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభమైతే 25 వేల మంది కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఇలా మొత్తం సుమారు 80 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.
ఈఎస్ఐ ఆస్పత్రి ఎంతో అవసరం
హుజూర్నగర్ నియోజకవర్గంలో సిమెంట్, రైస్తో పాటు పలు రకాల పరిశ్రమలు చాలా ఉన్నాయి. దాంతో కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారితో పాటు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే చికిత్స పొందేందుకు ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం. అందుకే ఆస్పత్రిని మంజూరు చేయించాను. గతంలో ప్రాతినిథ్యం వహించిన వారు కార్మికుల శ్రేయస్సును పట్టించుకొని ఉంటే ఈఎస్ఐ ఆసుపత్రి ఎప్పుడో వచ్చి ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలనే డిమాండ్ ఉన్నప్పటికీ హుజూర్నగర్కు మంజూరు చేయించిన సీఎం కేసీఆర్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
– శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్యే, హుజూర్నగర్
ఆనందంగా ఉంది
హుజూర్ నగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి రావడం హర్షణీయం. ఇప్పటి వరకు కార్మికులకు ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. రవాణా చార్జీలు భారం గా మారేవి. అంతదూరం వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్మికుల సమస్యలు తెలిసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈఎస్ఐ ఆస్పత్రిని తీసుకురావడం గొప్ప విషయం.
– చల్లా సాయి, నాగార్జున సిమెంట్స్ కార్మికుడు, మఠంపల్లి
కార్మికుల ఇబ్బందులు తీరుతై
హుజుర్ నగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే కార్మికుల సమస్యలు తీరుతై. నేను దక్కన్ పరిశ్రమలో పనిచేస్తున్నాను. మాకు ఆరోగ్య సమస్యలు వస్తే ఫ్యాక్టరీ వాళ్లు నిర్వహించే మెడికల్ క్యాంపుల్లోనే చూపించుకొని సరిపెట్టుకొనే వాళ్లం. ఇంకా ఏమైన సమ స్య వస్తే ప్రైవేటు ఆస్పత్రి వెళ్లాల్సి వచ్చేది. గతంలో ఉన్న నాయకులెవరూ ఈఎస్ఐ ఆస్పత్రి తీసుకురాలేక పోయారు. ప్రస్తుతం హుజూర్నగర్లో ఆస్పత్రికి ఏర్పాటు చేస్తే మా లాంటి కార్మికుల ఇబ్బందులు తీరుతై. కార్మికుల తరఫున సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– పోగు పద్మ, మహంకాళీగూడెం, పాలకవీడు