పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యమని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హన్మంతు కె. జెండగే స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోసుకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఎన్నికలను వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు చెప్పారు. 403 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఆదివారం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కలెక్టర్ పలు విషయాలను వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించాం. ప్రతి గ్రామంలో పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా, ప్రచార రథాల ద్వారా ఓటర్లలో అవగాహన, చైతన్యం కల్పించాం. ఇక స్వయం సహాయక సంఘాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలల్లో విద్యార్థులతో సంకల్ప పత్రం తీసుకున్నాం. ఉపాధి హామీ కూలీల వద్ద ఓటుపై అవగాహన చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. ఇదే సమయంలో ఏ ఒక్కరూ ప్రలోభాలకు గురికావద్దు. ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని భావిస్తున్నాం.
పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందిస్తున్నాం. రెండో విడుత ర్యాండమైజేషన్ ద్వారా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించాం. 25శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40శాతం అదనంగా వీవీ ప్యాట్లు కేటాయించాం. పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రెండు పోలింగ్ స్టేషన్లకు ఒక మైక్రో అబ్జర్వర్ను నియమించాం. రెండు కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను ఉన్న దగ్గర ఇద్దరు, ముగ్గురు మైక్రో అబ్జర్వేర్లను పెట్టాం. రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు కేంద్ర బలగాలను కూడా అందుబాటులో ఉంచాం.
ఎన్నికల్లో 39మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకటి నోటా ఉంటుంది. మొత్తం 40 గుర్తులకు మూడు బ్యాలెట్లు ఉంటాయి. కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక్కొక్కటి ఉంటాయి. పార్లమెంట్ పరిధిలో మొత్తం 2,141 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 6,429 ఈవీఎంలు అవసరం పడతాయి. ఇవే కాకుండా వివిధ కారణాలతో ఇబ్బందులు తలెత్తితే సమస్య లేకుండా మరికొన్ని ఈవీఎంలను ముందస్తుగా తరలిస్తాం. బ్యాలెట్లపై తొలుత జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు, ఆ తర్వాత గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులను ముద్రిస్తారు.
80ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులను సంప్రదించాం. వారికి రవాణా కావాలంటే ప్రత్యేకంగా సిబ్బంది వాళ్ల ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తారు. ఓటు వేశాక తిరిగి ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. పోలింగ్ స్టేషన్లోని ప్రతి లొకేషన్లో వీల్ చైర్ ఏర్పాటు చేయడంతో పాటు దాన్ని నెట్టడానికి వలంటీర్లను కూడా అందుబాటులో ఉంచాం. వాళ్లను ఇంటి నుంచి తీసుకొచ్చి.. ఓటు వినియోగించుకున్నాక.. మళ్లీ ఇంటి దగ్గర దించేవరకు అన్ని జాగ్రత్తలు చూసుకుంటారు.
జిల్లాలో ఇప్పటికే 83శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశాం. కొందరు బయట ఉండటం, మరికొందరు చనిపోవడంతో మిగిలిపోయాయి. మిగిలి ఉన్న సమయంలో వంద శాతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటు వేసే సమయంలో ఓటరు కార్డుతోపాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపించాలి. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
పోలింగ్ రోజు పోలింగ్కు రెండు గంటల ముందే మాక్ పోలింగ్ ఉంటుంది. దీనిపైన అభ్యర్థులందరికి కూడా అవగాహన కల్పించాం. పోలింగ్ ఏజెంట్స్ అందరూ ముందుగానే చేరుకోవాలి. ఫామ్ 10 నింపి, ఐడెంటిటీ కార్డును తీసుకోవాలి. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 13న పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
ఎండల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు..?
ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగు నీటి సదుపాయం, నీడ, ఫస్ట్ ఎయిడ్ కిట్, స్లైన్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ స్టేషన్లలో వెలుతురు అంశం మా దృష్టికి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో లైటింగ్ మంచి ఏర్పాటు చేస్తాం. కరెంట్ సరఫరా, బల్బులను పెట్టాం. 2141పోలింగ్ స్టేషన్లలో మంచి లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి.. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
పార్లమెంట్ పరిధిలో 403 సమస్యాత్మక పోలిం గ్ కేంద్రాలను గుర్తించాం. రెండు వల్నరబుల్ పో లింగ్ బూత్లను ఐడెంటిఫై చేశాం. ఆయా ప్రాంతా ల్లో అదనపు బలగాల ఏర్పాటుకు ప్రణాళిక రూ పొందించాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.