నకిరేకల్, నవంబర్ 22 : గ్రామాల్లో జరిగిన అభివృద్ధ్దిపై ప్రతి గ్రామంలో రచ్చబండ వద్ద చర్చించిన తర్వాతనే తమకు ఓటు వేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 3, వార్డుల్లో బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, నలగాటి ప్రసన్నరాజ్తో కలిసి వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నకిరేకల్లో జరిగిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా చూపిస్తూ, మ్యానిఫెస్టో అంశాలను వివరించారు.
నమూనా బ్యాలెట్ పేపర్లో కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వచ్చిన తరువాత నకిరేకల్ నియోజకవర్గంలో వార్ వన్సైడే ఉంటుందని భావించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.నియోజకవర్గం లో రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని, సీఎం కేసీఆర్ అభిమానమే కారణమన్నారు. నకిరేకల్ పట్టణంలోని 20 వార్డుల్లో దాదాపు రూ.20 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
దాదాపు రూ.135 కోట్లతో నకిరేకల్ను నల్లగొండ పట్టణ తరహాలో తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ నిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, నలగాటి ప్రసన్నరాజ్, చింతల సోమన్న మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ ఉమారాణీకృష్ణమూర్తి, సీనియర్ నాయకులు చెరుకు లక్ష్మీసుధాకర్, పెండెం సదానం దం, సోమ యాదగిరి, రావిరాల మల్లయ్య, నోముల విజయ్కుమార్, కౌన్సిలర్లు కం దాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, చింతా స్వాతీత్రిమూర్తులు, కొండ శ్రీను, చౌగోని లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, దైద పరమేశ్, యాళ్ల ప్రసాద్, పెండెం సంతోష్, బూత్కూరి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
నార్కట్పల్లి : ఎవరెన్నీ కుట్రలు పన్నిన నకిరేకల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చిప్పలపల్లి, అక్కెనపల్లి, చిన్నతుమ్మలగూడెం గ్రామాల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. గ్రామస్తులు ఆయనకు పూలమాలతో సత్కరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశామని తెలిపారు.
కుల,మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి ఓటర్లు మోస పోవద్దన్నారు. కోమటిరెడ్డి సోదరులు బీఆర్ఎస్ నాయకులను తొక్కుకుంటూ వెళ్తాననడం డబ్బు అహంకారంతో మా ట్లాడుతున్నారని విమర్శించారు. నల్లగొండ, మునుగోడులలో కోమటిరెడ్డి సోదరులు ఓడిపోవ డం ఖాయమన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్లె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.