మునుగోడు, నవంబర్14 : సమైక్య పాలనలో మునుగోడు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బోనాలు, డప్పు చప్పుళ్లతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు, మహిళలు తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొల్లేడు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.1.5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. చొల్లేడు నుంచి బోడ్గపర్తి వరకు రూ.3కోట్లతో బీటీ రోడ్డు నిర్మించామని, దాంతో పాటు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.50కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల ఇబ్బందులు తీర్చినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి వంటి అనేక పథకాలు అందుతున్నాయన్నారు. మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు ఆగమాగమవుతున్నారని, ప్రభుత్వాని బద్నాం చేసేందుకు ఆసత్యప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం మీ మధ్యలోనే ఉండే నాయకుడు కావాలా?.. గెలిచిన తర్వాత తన కాంట్రాక్టులు చూసుకునే నాయకుడు కావాలా? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులకు ఎన్నికల వేళ మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తరని, ఎన్నికలై పోయాక వారు కంటికి కూడా కనిపించరని చెప్పారు. స్థానికుడినైన తాను ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని, మరో మారు ఆశీర్వదిస్తే ఐదేండ్లలో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఫ్లోరైడ్ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్దే : పల్లె రవికుమార్
రాష్ట్ర గీత కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందించి ఫ్లోరైడ్ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 8 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. నిరంతంరం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురశోత్తంరెడ్డి, ఎంపీటీసీలు వనం నిర్మలాయాదయ్య, పొలగోని విజయలక్ష్మీసైదులుగౌడ్, స్థానిక సర్పంచ్ జనగిల మహేశ్వరీసైదులు, నాయకులు బుడిగపాక ఏసు, బొడ్డు నరసింహ, సాగర్రెడ్డి, బొడ్డు నరసింహ, సత్తయ్య, కట్కూరి శంకర్, వనం శంకర్, వి.లింగయ్య, బొడ్డు యాదయ్య, వంగూరి రాజు, చంద్రయ్య, రవి, నారబోయిన సైదులు, కట్కూరి శ్రీను, పెంబళ్ల శంకర్, ముప్పా వెంకట్రెడ్డి, బుషిపాక నరిసింహ పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి..
మునుగోడు : మండలంలోని ఊకొండి గ్రామానికి చెందిన 30 కాంగ్రెస్, బీజేపీకి చెందిన 30 కుటుంబాలు మంగళవారం ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో చందపాక నాని, ఏర్పుల రాజు, జాల నరేందర్, దొడ్డి జగదీశ్, గురిజాల మహేశ్, బొడ్డుపల్లి స్వామి, చందపాక కార్తీక్, జాల పవన్, సిద్దగోని అజయ్, కోడూరు శివ, బోయపల్లి శివ, పొలగోని వంశీ, కార్యకర్తలు ఉన్నారు.
మునుగోడు అభివృద్ధి కోసం సరైన నిర్ణయం తీసుకోవాలి : ఎమ్మెల్యే
చండూరు : బీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోరారు. మంగళవారం చండూరు మండలంలోని కొండాపురం, నెర్మట, దోనిపాముల, జోగిగూడెం, తిమ్మారెడ్డి, తుమ్మలపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. గ్రామాల్లో మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. సభలకు తరలివస్తున్న జన సందోహంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనుత్తేజం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014లో తాను గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పని చేసినా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు. వ్యక్తిగత స్వార్ధం కోసం ఎన్నికల బరిలో నిలిచే వ్యక్తులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో ఇప్పటికే 90శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. రోడ్లు, కమ్యూనిటీ భవనాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆదుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాగానే మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి ద్వారా రూ.3వేలు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 5లక్షల బీమా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఉజ్జిని అనిల్రావ్, రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు కోడి వెంకన్న, సర్పంచులు నందికొండ నర్సిరెడ్డి, కురుపాటి రాములమ్మ, నాయకులు ఎత్తెపు మధుసూదన్రావ్, బరిగెల లింగయ్య, గడ్డం నర్సింహ, నారపాక శంకర్, శిలివేరు సురేశ్, కురుపాటి లక్ష్మణ్, సుదర్శన్, చొప్పరి రవితేజ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 14 : బీజేపీ మండల కార్యదర్శి, అల్లందేవి చెరువు గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు గుండు రాజు గౌడ్, డీవైఎఫ్ఐ నాయకుడు గుండు లింగన్నతో పాటు గుజ్జ గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు మంగళవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి, నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేలా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇంత గొప్పగా మ్యానిఫెస్టోను విడుదల చేయలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నె ఇంద్రసేనారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, సర్పంచ్ సుర్వి యాదయ్య గౌడ్, నాయకులు కూసుకుంట్ల సత్తిరెడ్డి, వీరమళ్ల వెంకటేషం, గంగాదేవీ సత్తయ్య, ఏర్పుల రాజేశ్, వినోద్ గౌడ్, సుర్వి లింగస్వామి, అనిల్, విజయ్ పాల్గొన్నారు.
కొండూరు గ్రామానికి చెందిన నాయకులు
మర్రిగూడ : మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బడేటి జంగయ్య, ఆంబోతు లచ్చిరాం, కర్నాటి యాదయ్య, జర్పుల కిషన్ సహా పలువురు కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, ఉప సర్పంచ్ పాలకూర్ల జంగయ్య, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులు యాదవ్, మాజీ సర్పంచ్ పర్వతాలు, నాయకులు దండుగుల కృష్ణ, ఈద కృష్ణ, మట్టిపెల్లి నర్సింహ, బండి యాదయ్య, వల్లపు కొండలు, జరుపుల గోపాల్, రమేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూసుకుంట్లకు గౌడసంఘం మద్దతు
మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన గౌడసంఘం నాయకులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. సోమవారం సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు.