రామగిరి, నవంబర్ 19: నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లుగా జరుగని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూపించానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలల మైదానం, హైదరాబాద్ రోడ్డు దుకాణాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్జీ కళాశాలలో వాకర్స్ను కలిసి అభివృద్ధి ఓటు అభ్యర్థించారు. వాకర్స్కు ఆయనకు స్వాగతం పలికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
నల్లగొండ అభివృద్ధి కొనసాగడానికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ బూటకపు మాటలను నమ్మొద్ద అని అన్నారు. సీఎం కేసీఆర్తో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నల్లగొండలో మరోసారి ఎగురేది గులాబీ జెండే అన్నారు. ప్రచారంలో కళాశాలలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతి రఘుపతి, కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, జమాల్ఖాద్రి, జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.