తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల్లో సంతోషం నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని, 24 గంటల కరెంట్, పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో నేడు వ్యవసాయం పండుగలా మారిందని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ కరెంట్ కోతలు పెట్టి ప్రజలను నట్టేట ముంచే కాంగ్రెస్ పాలన కావాలో, అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
వలిగొండ, నవంబర్ 23 : సబ్బండ వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని జంగారెడ్డిపల్లి, అప్పారెడ్డిపల్లి. ఎం.తుర్కపల్లి, మొగిలిపాక, వెల్వర్తి, కేర్చిపల్లి, పులిగిల్ల, సుంకిశాల, మల్లేపల్లి, గోలిగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో రైతులంతా కరెంట్ కోసం గోసపడ్డారని, కరెంట్ ఎప్పుడొస్తుందో తెలువక బుగ్గల వైపు చూస్తుండేవారని, నాటేసిన పొలం ఎక్కడ ఎండిపోతుందనే భయాందోళనలో ఉండేవారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలితంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందుతుందన్నారు. కారుచీకట్ల నుంచి వెలుగుజిలుగుల తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు.
ఒక్కప్పుడు తెలంగాణ అంటేనే నెర్రలుపారిన నేలలు దర్శనమిచ్చేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పచ్చని మాగానంగా మారిందన్నారు. కరువును తరిమిన బీఆర్ఎస్ పార్టీ కావాలో, కల్లబొల్లి మాటలు చెప్పి కరెంట్ కోతలు పెట్టిన కాంగ్రెస్ కావాలో ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. ఎమ్మెల్యేగా రెండుమార్లు గెలిపించినందుకు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టానని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూసిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, చిట్టెడి జనార్దన్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, ముద్దసాని కిరణ్రెడ్డి, ముద్దసాని శశికళారెడ్డి, చెరుకు శివయ్య, మాద శంకర్గౌడ్, పసల అన్నామేరి, కల్కూరి రాములు, నానమాల ఉప్పలయ్య, జక్క వెంకట్రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.