రామన్నపేట, నవంబర్18: కాంగ్రెస్ బూటకపు హామీలను నమ్మితే ప్రజలకు కష్టాలు తప్పవని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నీర్నెంముల, శోభనాద్రిపురం గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సేవకుడిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రోజురోజుకు ప్రజా ఆదరణ పెరుగుతుందని, సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. అహంకారంతో కించపరిచే విధంగా మాట్లాడుతున్న రాజగోపాల్రెడ్డికి, వేముల వీరేశానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు నానా కష్టాలు పడ్డారని, కరెంట్ లేక పంటలకు నీరందించలేక నష్ట పోయారన్నారు.
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని నాయకులు విషప్రచారం చేస్తున్నారని ప్రజలు వారి మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో ఏం చేసిందని ప్రజ లు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బంధు పథకం అమలు కాదని, 24 గంటల కరెంటు కాస్తా 3 గంటలు అవుతుందన్నారు. కార్యక్రమంలో గోట్ అండ్ షిప్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్గౌడ్, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచులు ముత్యాల సుజాత రవి, కాల్యయామినీ శ్రవణ్కుమార్, ఉపసర్పంచులు చల్ల అనితాసత్యప్రకాశ్, ముక్కాంముల నరేందర్,గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం సతీశ్, గంగుల రాఘవరెడ్డి, ముక్కాంముల దుర్గ య్య, ఆవుల నరేందర్, ముక్కాంముల సత్తయ్య, సునీతాశివకుమార్, శ్రీధర్, శివప్రసాద్, కంచి నర్సింహ, సోమయ్య, చిన్నపాక రమేశ్, శేఖర్రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.
చిట్యాల, నవంబర్ 18 : నియోజకవర్గ ప్రజలందరూ కళ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. చిట్యాల పట్టణంలోని 2,8,9,10వ వార్డుల్లో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ నియోజకవర్గంలో, చిట్యాల మున్సిపాలిటీలో తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థ్దించారు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధ్దిని, ఇంట్లోకి వస్తున్న సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని కోరారు. తప్పుడు వాగ్దానాలతో అమలు సాధ్యం కాని హామీలతో వచ్చే అవకాశవాద వ్యక్తులను నమ్మి మోసపోవద్దని వివరించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండే తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం కార్యకర్తలను కూడ గుర్తు పట్టని, ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయని వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధ్ది, సంక్షేమం మరింత పరుగులు తీస్తాయని చిరుమర్తి అన్నారు. బీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ సౌమ్యుడు, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే చిరుమర్తిని గెలిపిస్తే సమస్యల పరిష్కారం సులభమవుతుందని అన్నారు. మంత్రు లు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ఎన్నో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధ్ది చేశాడని వివరించారు. ఇలాంటి వారిని గెలిపిస్తేనే మళ్లీ మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని అన్నారు.
తమ ఇంటి వద్దకు ఓటు అభ్యర్థ్దించడానికి వచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తికి మహిళలు బొట్టు పెట్టి, మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానం చేసి గెలుపు నీదేనంటూ ఆశీర్వదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు శేపూరి రవీందర్, బెల్లి సత్తయ్య, సిలివేరు మౌనికాశేఖర్, కోఆప్షన్ సభ్యుడు జడల ఆదిమల్లయ్య, నాయకులు కర్నా టి ఉప్పల్రెడ్డి, జగిని భిక్షంరెడ్డి, గోధుమగడ్డ జలం ధర్రెడ్డి, పల్లపు బుద్దుడు, దాసరి నర్సింహ, గౌస్, కోనేటి యల్లయ్య, గుండెబోయిన సైదులు, ర ంగా వెంకటేశ్వర్లు, జయారపు శివప్రసాద్ పాల్గొన్నారు.