నకిరేకల్, నవంబర్ 28 : ఎవ్వరూ ఎన్ని కుట్రలు పన్నిన సర్వేలన్నీ సీఎం కేసీఆర్ వైపే ఉన్నాయని, నకిరేకల్లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా నకిరేకల్ కనకదుర్గ ఆలయం నుంచి ఇందిరాగాంధీ సెంటర్, మూసీరోడ్డు, డాక్టర్స్ కాలనీలోనున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, నకిరేకల్లో యువతకు గంజాయి తాపిస్తూ రూ. 500, 200 ఇచ్చి ఇళ్లలకు వేసిన బీఆర్ఎస్ పోస్టర్ల, స్టిక్కర్స్ను చించివేయిస్తున్నారని, ప్రచార రథాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో అయ్యప్ప ఆలయం నిర్మిద్దామనుకుంటే ఆనాడు హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకుంది వేముల వీరేశం కాదా అని ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణాన్ని రూ.130 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. గురువారం జరగబోయే ఎన్నికల్లో అరాచకవాదాన్ని తిప్పి కొట్టి ప్రశాంత పాలనకు ఓటు వేయాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, చింతల సోమన్న, నలగాటి ప్రసన్నరాజ్, సందినేని వెంకటేశ్వర్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేష్, సింగిల్విండో చైర్మన్ మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొర్ల వీరయ్య, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు నవీన్రావు, సైదిరెడ్డి, సీనియర్ నాయకులు నడికుడి వెంకటేశ్వర్లు, సోమ యాదగిరి, కొండ జానయ్య, గుర్రం గణేశ్, కొండ వెంకన్న, రాచకొండ వెంకన్న, శ్రవణ్, దైద పరమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కట్టంగూర్,: రైతుబంధు డబ్బులు వేయకుండా అడ్డుపడిన కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని రసూల్గూడెం, అయిటిపాముల, అంబేద్కర్నగర్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సాగుకు పెట్టుబడుల కోసం అవసరమున్న సమయంలో రైతు కడుపున కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటాలంటే బీఆర్ఎస్ కార్తు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీలు నలమాద వీరమ్మాసైదులు, బెల్లి మహాలక్ష్మిసుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొడ్డుపల్లి హనుమయ్య. గ్రామశాఖ అధ్యక్షులు చౌగోని జనార్దన్, చౌగోని నాగరాజు పాల్గొన్నారు.
చిట్యాల : తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్ధి చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని 7,8వ వార్డుల్లో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వ్యాపార సముదాయాలు, ఇళ్లలోని ఓటర్లను కలిసి మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు చివరి దశకు వచ్చాయని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని జాతీయ రహదారికి ఇరువైపులా మురికి కాల్వ నిర్మాణం పూర్తి చేశామని ఈ సందర్బంగా వివరించారు. ఇందిరా నగర్లో ముస్లింలను కలిసి ఎల్లప్పుడు ముస్లిం సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ జడల అదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మండె సైదులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, నాయకులు గుండెబోయిన సైదులు, వనమా వెంకటేశ్వర్లు, శేపూరి రవీందర్, బెల్లి సత్తయ్య, జిట్ట పద్మ, జమాండ్ల జయమ్మ, పందిరి గీత, గోధుమగడ్డ జలంధర్రెడ్డి, పాటి మాధవరెడ్డి, జమీరుద్దీన్, ప్రవీణ్ పాల్గొన్నారు. వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చిరుమర్తి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.