కోదాడ, ఫిబ్రవరి 18 : కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ చైర్పర్సన్ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును వేదిక సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని సమస్యలను క్రోడీకరించి తాము ఎన్నికల ముందు పీపుల్స్ ఏజెండాను అభ్యర్థుల ముందు ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా కోదాడ పట్టణంలో పారిశుధ్య లోపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తక్షణమే సదరు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయా వార్డులలో మౌలిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పందిరి నాగిరెడ్డి, డిఎన్ స్వామి, రాపర్తి రామ నరసయ్య, కోటయ్య, భిక్షం, ముత్తవరపు రామారావు, జి ఎల్ఎన్ రెడ్డి, ఎస్ఎస్ రావు, ధనమూర్తి, హరి కిషన్ రావు బాబు పాల్గొన్నారు.