బీబీనగర్, డిసెంబర్ 28 : ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందుతారని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మాదారంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునగుంట్ల కల్పనాశ్రీనివాస్గౌడ్ 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ముందుకురావడంతో బుధవారం వారు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వంటనూనె కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలకు 90శాతం, ఓసీలకు 80, ఎస్సీ, ఎస్టీలకు 100 సబ్సిడీపై మొక్కలు అందిస్తుందని తెలిపారు.
జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఎంపీపీ సుధాకర్గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామియాదవ్, జడ్పీటీసీ బీరు మల్లయ్య, సర్పంచులు మందడి అలివేలు, మహేశ్నాయక్, నాయకులు కొలను దేవేందర్రెడ్డి, కొంతం లింగెయ్యగౌడ్, తొరుపునూరి రాజశేఖర్గౌడ్, ఆముదాల పాండుగౌడ్, కొరిమిండ్ల కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనూరాధ, ఆర్టికల్చర్ జిల్లా అధికారి అన్నపూర్ణ, అగ్రికల్చర్ ఏడీ దేవ్సింగ్, ఏఓ దీప్తి పాల్గొన్నారు.