సమైక్య పాలనలో కుంటుపడిన హుజూర్నగర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృషితో నాలుగేండ్లలో రూ.4వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. రోడ్లు, వసతులు, సౌకర్యాలు మెరుగుపడి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. రూ.1,639 కోట్లతో లిఫ్ట్లు, 27 కోట్ల రూపాయలతో చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టారు. మిషన్ కాకతీయ ద్వారా 126 చెరువులను పునరుద్ధరించారు. దాంతో భూగర్భ జలాలు పెరుగడంతోపాటు చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందుతున్నది. కాగా, గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన ఉత్తమ్కుమార్రెడ్డి హయాంలో నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది.
హుజూర్నగర్ మున్సిపాలిటీకి గతంలో రూ.35 కోట్లు మంజూరు కాగా, ఇటీవల సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ మరో రూ. 25కోట్లు ప్రకటించారు. లింగగిరి జంక్షన్ నుంచి మఠంపల్లి జంక్షన్ వరకు డ్రైనెజీల నిర్మాణం కోసం 2కోట్ల 59లక్షల 15వేలు, లింగగిరి జంక్షన్ నుంచి మఠంపల్లి జంక్షన్ వరకు సింగిల్ ఆర్మ్ లైటింగ్ కోసం రూ.39.15 లక్షలు కేటాయించారు.
ఇందిరాచౌక్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం రూ.4కోట్ల 45 లక్షల 15 వేలు, పీఎస్ఆర్ సెంటర్ నుంచి మఠంపల్లి జంక్షన్ వరకు రూ.1కోటి 13 లక్షల15వేలు బీటీ రోడ్డు కోసం, సింగిల్ ఆర్మ్ లైటింగ్ గాంధీపార్కు నుంచి మఠంపల్లి జంక్షన్, అనుములగూడెం రోడ్డు వరకు రూ.52.15 లక్షలు, బీటీరోడ్డు గాంధీ పార్కు నుంచి మేళ్లచెర్వు జంక్షన్, గోవిందాపురం రూ.98.15 లక్షలు, సింగిల్ ఆర్మ్ లైటింగ్ గాంధీపార్క్ నుంచి మేళ్లచెర్వు జంక్షన్, గోవిందాపురం రూ.34.15 లక్షలు, సీసీరోడ్డు తేజ టాలెంట్ స్కూల్ నుంచి బైపాస్ రోడ్డు రూ.87.15 లక్షలు, సింగిల్ ఆర్మ్ లైటింగ్ తేజ టాలెంట్ స్కూల్ నుంచి బైపాస్రోడ్డు రూ.39.15 లక్షలు, సీసీరోడ్డు మిర్యాలగూడెం రోడ్డు నుంచి ఎస్ఎస్పీ క్యాంప్ రూ.83.15 లక్షలు. సింగిల్ ఆర్మ్ లైటింగ్.
మిర్యాలగూడెం రోడ్డు నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ రూ.39.15 లక్షలతో సీసీరోడ్డు, హుజూర్నగర్ మెయిన్ రోడ్డు నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ రూ.29.15 లక్షలు, ఇంటిగ్రేటెడ్(వెజ్-నాన్వెజ్) మార్కెట్, పండ్లు-పూలు ఎన్ఎస్పీ క్యాంప్ రూ.6 కోట్ల 48 లక్షల 15 వేలు, సింగిల్ ఆర్మ్ లైటింగ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూ.22.15 లక్షలు, నూతన గ్రంథాలయ నిర్మాణం పాత గ్రామపంచాయతీ స్థలంలో రూ.82.15 లక్షలు, వీధి వ్యాపారులకు షెడ్ల నిర్మాణం రూ.94.15 లక్షలు, ఎన్ఎస్పీ క్యాంప్లోని పార్కు అభివృద్ధికి రూ.కోటి 15 లక్షల 15 వేలు, 300 ఎంఎం పైపులైన్ల నిర్మాణం పీఎస్ఆర్ సెంటర్ నుంచి హుజూర్నగర్ మున్సిపాలిటీ వరకు రూ.88.15 లక్షలు, బీటీ రోడ్డు లింగగిరి జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు రూ.కోటి 31 లక్షల15 వేలు కేటాయించారు. మరో రూ.10 కోట్లు మంత్రి కేటీఆర్ మంజూరు చేయగా వాటితో హుజూర్నగర్ మున్సిపాలిటీలోని వీధుల్లో సీసీరోడ్డు, డ్రైనేజీల నిర్మాణం పూర్తికాగా, నూతనంగా మంజూరు చేసిన రూ. 25కోట్లతో పనులు సాగుతున్నాయి.
నేరేడుచర్ల, అక్టోబర్ 30 : సమైక్య పాలనలో అభివృద్ధిలో కుంటుపడిన హుజూర్నగర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తుంది. నియోజకవర్గంలో నాలుగేండ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో హుజూర్నగర్లో జరిగిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు కట్టుబడి వరాల జల్లు కురిపించారు. దాంతో నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తూ అభివృద్ధికి కేరాప్గా మారింది. హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు,
ఒక్కో మండలానికి రూ.30లక్షలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో లే అవుట్ల ద్వారా వచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో క్రీడా ప్రాంగణాలు, పార్కులు, నర్సరీలు, ఆటోనగర్ నిర్మాణం, బంజారాభవన్, సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టారు. మిర్యాలగూడ-కోదాడ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా నేరేడుచర్ల, హుజూర్నగర్లో చేపట్టిన ప్రధాన రహదారిని 100 అడుగుల మేర విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో రెండు మున్సిపాలిటీలు అందంగా కనివిందు చేస్తున్నాయి. ఆర్డీఓ కార్యాలయం, ఈఎస్ఐ ఆస్పత్రి, బంజారాభవన్, మేళ్లచెర్వులో గిరిజన గురుకుల పాఠశాల అందుబాటులోకి వచ్చాయి. సూర్యాపేట సభలో మరోసారి సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వరాలజల్లు కురిపించారు. హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఒక్కొక్కదానికి రూ. 25కోట్లు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రకటించారు.
అభివృద్ధి అంటే హుజూర్నగర్ నియోజకవర్గం గుర్తుకొచ్చేలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా. గెలిచిన నాలుగేండ్లలోనే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో రూ.4వేల కోట్లకు పైగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా. గత ప్రభుత్వాల పాలనలో ఏ గ్రామాన్ని చూసిన సమస్యలకు పుట్టినిల్లుగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో దాదాపు సీసీరోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశాం. కొద్దిగొప్ప మిగిలిపోయిన పనులను కూడా త్వరలోనే పూర్తిచేసి ఆదర్శం నియోజకవర్గంగా నిలుపుతా.
-శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే
నేరేడుచర్ల మున్సిపాలిటీకి విడుదలైన మొత్తం రూ.50కోట్లతో పట్టణంలోని ప్రధాన కూడలి నుంచి జాన్పహాడ్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు బీటీ రోడ్డు కోసం రూ.2.35 కోట్లు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ కోసం రూ.68లక్షలు, డ్రైనేజీ కోసం రూ.2 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సెంటర్ నుంచి శాంతినగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.1.30 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.కోటి, లైటింగ్ కోసం రూ.40 లక్షలు, సెంటర్ నుంచి పాత నేరేడుచర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.87లక్షలు, డ్రైనేజీ కోసం రూ.1.32 కోట్లు, లైటింగ్కు రూ.38 లక్షలు, తాసీల్దార్ కార్యాలయం నుంచి రామాపురం రోడ్డు వరకు రూ.1.26 కోట్లు, లైటింగ్ కోసం రూ.22 లక్షలు, హిందూ శ్మశాన వాటిక కోసం రూ.70 లక్షలు కేటాయించారు.
ఇప్పటికే రామాపురం రోడ్డు, పాత నేరేడుచర్ల రోడ్డు, తాసీల్దార్ కార్యాలయం నుంచి రామాపురం రోడ్డు వరకు పనులు పూర్తి చేశారు. తాజాగా విడుదలైన మరో రూ.10 కోట్లతో మిర్యాలగూడ ప్రధాన రోడ్డు నుంచి మార్కెట్ పక్క నుంచి జాన్పహాడ్ రోడ్డు వరకు సీసీ రోడ్డు కోసం రూ.1.39 కోట్లు, జాన్పహాడ్ రోడ్డు నుంచి శివాలయం మీదుగా హుజూర్నగర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు కోసం రూ.2.79 కోట్లు, గ్రంథాలయ నిర్మాణం కోసం రూ.30 లక్షలు, జాన్పహాడ్ రోడ్డు నుంచి పీహెచ్సీ మీదుగా టెంపుల్ రోడ్డు వరకు సీసీరోడ్డు కోసం రూ.52 లక్షలు, సమీకృత మార్కెట్ ప్రహరీ కోసం రూ.33లక్షలు, మిర్యాలగూడ రోడ్డు నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు సీసీరోడ్డు, లైటింగ్ కోసం రూ.38లక్షలు, ఆర్-3 కాల్వ నుంచి శిశుమందిర్ స్కూల్ వరకు 6 కల్వర్టుల నిర్మాణం కోసం రూ.2.84 కోట్లు, పాత నేరేడుచర్ల డంపింగ్ యార్డు అభివృద్ధి కోసం రూ. 80 లక్షలు, డంపింగ్ యార్డు నిర్మాణం కోసం రూ.65 లక్షలు కేటాయించారు. నూతనంగా ప్రకటించిన రూ.25 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి పనులను ప్రారంభించారు.
నియోజకవర్గంలో లిఫ్ట్ల కోసం రూ.1,639 కోట్లు మంజూరు చేసింది. జాన్పహాడ్ మేజర్, ముక్త్యాల మేజర్లకు రూ.16.23 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్పై ఇరిగేషన్ లిఫ్ట్ కోసం రూ.1,450 కోట్లు, జాన్పహాడ్ మేజర్ కోసం రూ.173 కోట్లు మంజూరు చేసింది. జాన్పహాడ్- ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఎన్ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల కాల్వకు లైనింగ్ పనులకు రూ.340 కోట్లు మంజూరు చేశారు. పెదవీడు-మహాంకాళిగూడెం లిఫ్ట్ మరమ్మతులకు రూ.1.20 కోట్లు