నీలగిరి, మే 4 : ఇక నుంచి సెల్పోన్ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందొద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని నల్లగొండ ఎస్పీ అపూర్వరావు అన్నారు. నల్లగొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 50 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లాడుతూ..
సీఈఐఆర్ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సెల్ఫోన్ల స్వాధీనంలో ప్రతిభ కనబరిచిన టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, సిబ్బంది బాలకోటి, శంకర్ను ఎస్పీ అభినందించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రినిరెడ్డి, అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాదరావు, నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.