ప్రజా చైతన్యానికి పునాదులు వేసిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన అమరత్వమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దారి చూపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ
రైతాంగ పోరాటంలో కొమురయ్య పాత్ర ఎనలేనిదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ త్యాగధనులను గుర్తించకుండా మరుగున పడేశారని, నేడు సీఎం కేసీఆర్ నాటి మహనీయుల కలలను సాకారం చేస్తున్నారని తెలిపారు. పోరాట యోధుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.
– సూర్యాపేట టౌన్, జూలై 4
సూర్యాపేట టౌన్, జూలై 4 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య.. 19 ఏండ్ల వయసులోనే గొప్ప పోరాట పటిమ ప్రదర్శించాడు.. పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరులో అమరుడయ్యాడని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనకు మొదట దారి చూపింది ఆయన అమరత్వమేనని.. గ్రంథాలయ ఉద్యమం మొదలు పెట్టి.. ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నతమై వ్యక్తి అని కొనియాడారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన మరణంతో ప్రజా చైతన్యానికి పునాదులు వేసిన మహనీయుడు కొమురయ్య అని కొనియాడారు. గత ప్రభుత్వాలు ఏనాడూ తెలంగాణ త్యాగధనులను గుర్తించకుండా 60 ఏండ్లు మన వాళ్లను మరుగున పడవేశారని, కనీసం రైతాంగ సాయుధ పోరాట యోధులను కూడా స్మరించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహనీయులందరినీ గౌరవించుకుంటున్నామని.. మహనీయుల జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఘనమైన నివాళి అర్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే మహనీయుల కలలు సాకారమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, పాల్గొన్నారు.
కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి : ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ రూరల్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య వర్థంతిని హైదరాబాద్ రోడ్డులోని ఆర్జాలబావి సర్కిల్లో మంగళవారం దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వస్తుందన్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, పలు ఉద్యోగ , విద్యార్థి సంఘాలు దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కౌన్సిలర్ గోగుల శ్రీను, దుడుకు లక్ష్మీనారాయణ, ఐతగోని జనార్దన్గౌడ్, మామిడి ప ద్మ, పందుల సైదులు, రావుల శ్రీనివాస్రెడ్డి, మేకల యాదన్న, సుంకరబోయిన సత్యనారాయణ, వేణు పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కొమురయ్య ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మర్రూర్ ఎంపీటీసీ దాసరి వీరార్జున్రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు, ఉగ్గిడి శ్రీను, దాసరి సైదులు, పాలడుగు సంపత్ పాల్గొన్నారు.
చిట్యాల: చిట్యాలలో సీపీఎం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, ఆరూరి శ్రీను, నారబోయిన శ్రీనివాసులు. కత్తుల లింగస్వామి, రుద్రారపు పెద్దులు, శీల రాజయ్య, ఐతరాజు నర్సింహ, అక్కెనపల్లి నాగయ్య పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్గూరి నర్సింహ, మండల కార్యదర్శి చాపల నాయకులు తీర్పారి వెంకటేశ్వర్లు, గురుజ రామచంద్రం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.